స్టార్ త్రినేత్రం, వేములవాడ: వేములవాడ పట్టణంలోని ప్రసిద్ధ రాజన్న ఆలయం ఆవరణలో ఆదివారం భక్తులకు, యాచకులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. సాయిరూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీతో పాటు వాటర్ బాటిల్స్ అందజేసే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్న యాచకులు ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. భక్తి, సేవా భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లీ బాబురావు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో తమ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దాతల సహకారంతో వారి పేరుపేరునా అన్న ప్రసాదం, వాటర్ బాటిల్స్ను యాచకులకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా కరీంనగర్కు చెందిన వ్యాపారవేత్త పిల్లి మౌనిక తమ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
రాజన్న ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఆకలి దప్పికలతో ఉన్న వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని, అవసరమైన ప్రతి చోట సేవ చేయడమే తమ లక్ష్యమని ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. దాతల సహకారం, స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎద్దండి రాజు, గోటే నవీన్, వేముల సతీష్, కూరగాయల వినయ్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. రాజన్న సన్నిధిలో జరిగిన ఈ సేవా కార్యక్రమం భక్తుల్లో సంతృప్తిని కలిగించడంతో పాటు, సేవా సంస్థల పాత్ర ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ALSO READ: Collector: ఎన్నికల నిబంధనల అమలులో రాజీ ఉండదు
Last Updated on February 9, 2026 · 7:18 PM by Star Trinethram



