Alert: మీక్కూాడా ఈ మెసేజ్ లు వస్తున్నాయా.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే చాలా డేంజర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసం ప్రారంభించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వెల్లడించింది.
Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసం ప్రారంభించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వెల్లడించింది. ‘ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్’ పేరుతో వస్తున్న కొన్ని ఫేక్ మెసేజ్ల ద్వారా వినియోగదారులకు ఏపీకే (APK) ఫైల్ను డౌన్లోడ్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫైల్ను ఇన్స్టాల్ చేస్తే, రివార్డ్ పాయింట్స్ను రీడీమ్ చేసుకోవచ్చని నమ్మించి వినియోగదారుల వ్యక్తిగత డేటాను దోచుకుంటున్నారు.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించిన ప్రకారం, ఎస్బీఐ ఎప్పుడూ SMS లేదా వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లను లేదా లింకులను పంపదని స్పష్టం చేసింది. ఈ రకమైన సందేశాల్లో “రూ. 9980 విలువైన రివార్డ్ పాయింట్స్ గడువు ఇవాళ్టితో ముగుస్తుంది, వెంటనే రీడీమ్ చేసుకోండి” అంటూ తక్షణ చర్య తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇది వినియోగదారుల్లో తడబాటు కలిగించి మాల్వేర్ ఫైళ్లను ఇన్స్టాల్ చేయించేలా చూస్తుంది. ఈ ఫైళ్ల ద్వారా బ్యాంకింగ్ డేటా, పాస్వర్డులు, ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతిలో పడే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో పీఐబీ ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో ఒక పోస్ట్ ద్వారా ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. “ఎస్బీఐ రివార్డ్స్ కోసం ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయమని మెసేజ్ వచ్చిందా? వెంటనే అలాంటి మెసేజ్ లను డిలీట్ చేయండి. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు” అని సూచించింది.
కస్టమర్లు తీసుకోవలసిన జాగ్రత్తలు:
-
ఎప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి నమ్మకమైన సోర్సుల నుంచే యాప్లను డౌన్లోడ్ చేయండి.
-
ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ను నిజంగా రీడీమ్ చేయాలంటే, అధికారిక వెబ్సైట్ https://www.rewardz.sbi/ లేదా 1800-209-8500 నంబర్ను సంప్రదించండి.
-
అనుమానాస్పద మెసేజ్లు వచ్చినప్పుడు వాటిని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి లేదా 1930 హెల్ప్లైన్కు కాల్ చేయండి.
ఇటీవలి కాలంలో భారత్లో డిజిటల్ మోసాలు తీవ్రంగా పెరిగాయి. 2024 మొదటి త్రైమాసికంలోనే ప్రజలు సైబర్ మోసాల వల్ల రూ.120.3 కోట్లు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఎస్బీఐ కస్టమర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, ఫైళ్లను అసలు తెరవకూడదని, తన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు.
Alert: మీక్కూాడా ఈ మెసేజ్ లు వస్తున్నాయా.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే చాలా డేంజర్