Sludge: చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా బురద పోసిన మున్సిపల్ సిబ్బంది.. వ్యక్తి మృతి
ఉత్తరప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా బరేలీలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తిపై ట్రాలీ బురద పోయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ వ్యక్తి సజీవ సమాధి అయ్యాడు.
Sludge: ఉత్తరప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా బరేలీలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తిపై ట్రాలీ బురద పోయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ వ్యక్తి సజీవ సమాధి అయ్యాడు. మృతుడిని 45 ఏళ్ల సునీల్ కుమార్ గా గుర్తించారు. ఆయన తన ఇంటికి సమీపంలోని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా, కాలువ నుండి తొలగించిన బురద అతనిపైకి పోయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
బరేలీ అంతటా కాలువలను శుభ్రం చేస్తున్నారని, తొలగించిన బురదను నగరం వెలుపల ట్రాలీలలో వేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సునీల్ను గమనించకుండానే బురదతో నిండిన ట్రాలీని అతనిపై పడేశారు. ప్రజలు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించే సమయానికి, పలు నివేదికల ప్రకారం అతను అప్పటికే చనిపోయాడు.
కూరగాయలు అమ్మే సునీల్ తన పని ముగించుకుని చెట్టు పక్కన నిద్రిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిర్లక్ష్యం వహించినందుకు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు సంఘటన అనంతరం తెలిపారు.
Also Read: New Covid-19: కరోనా మళ్లీ వచ్చేస్తోంది.. పెరుగుతున్న కేసులు.. మళ్లీ టెన్షన్ టెన్షన్
Sludge: చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా బురద పోసిన మున్సిపల్ సిబ్బంది.. వ్యక్తి మృతి