Viral Video: బుడ్డోడి వీడియో వైరల్.. అంగన్వాడీ కేంద్రాల మెనూలో కీలక మార్పులు
కేరళలో అంగన్వాడీ మెనూల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇటీవలే అంగన్వాడీల పునఃప్రారంభ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి వీణా జార్జ్ పాల్గొని, కొత్త మెనూను ప్రకటించారు.
Viral Video: కేరళలో అంగన్వాడీ మెనూల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇటీవలే అంగన్వాడీల పునఃప్రారంభ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి వీణా జార్జ్ పాల్గొని, కొత్త మెనూను ప్రకటించారు. ఈ మెనూలో ఎగ్ బిర్యానీ, పులావ్, దాల్ పాయసం, సోయా డ్రై కర్రీ, లడ్డూలు వంటి ఆహారాలు చేర్చారు. ఇప్పటివరకు వారానికి రెండు సార్లు మాత్రమే అందించిన పాలను ఇకపై మూడు సార్లు అందిస్తామని ఆమె తెలిపారు.
ఈ మార్పుకు కారణమేంటంటే, ఫిబ్రవరిలో అలప్పుళలోని ఒక చిన్నారి శంకు చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ చిన్నారికి ఇంట్లో బిర్యానీ తినడం ఇష్టమని, అంగన్వాడీలో ఉప్మాకు బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై ఇవ్వాలని తల్లికి అనుకుంటూ చెప్పిన ఆ మాటలు పెద్ద హైప్ని క్రియేట్ చేశాయి. తల్లి ఆ మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా పాపులర్ అయింది.
ఈ వీడియో మంత్రి వీణా జార్జ్ దృష్టికి రావడంతో, ఆమె అంగన్వాడీలో ఇస్తున్న ఆహారాన్ని పరిశీలించి మెరుగులు చేయాలని హామీ ఇచ్చారు. ఈ మార్పులు అమలు చేయడం మొదటిసారి అని మంత్రి స్పష్టం చేశారు. నెటిజన్లు కూడా అంగన్వాడీ పిల్లలకు మంచి, పోషకమైన ఆహారం ఇవ్వాలని కోరుతూ స్పందిస్తున్నారు.
Also Read: Odisha: తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు.. ఐదుగురు పేషంట్స్ మృతి
Viral Video: బుడ్డోడి వీడియో వైరల్.. అంగన్వాడీ కేంద్రాల మెనూలో కీలక మార్పులు