Crime News: ప్రేమను ఒప్పుకోలేదని 18 సార్లు స్క్రూడైవర్ తో పొడిచి యువతిని హత్య
ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ జిల్లా మైనాథేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
Crime News: ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ జిల్లా మైనాథేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం సైరా అనే యువతి పశువులకు మేత తెచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి రాలేదు. ఆమె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లేకపోయింది.
అయితే, మరుసటి రోజు ఆమె రక్తంలో మునిగిన మృతదేహాన్ని పొలాల్లో కుటుంబ సభ్యులు గుర్తించారు. శరీరంపై తీవ్ర దాడుల గుర్తులు కనిపించాయి. ఈ దృష్ట్యా మొదట పోలీసులకు ఇది అత్యాచారం తర్వాత హత్య కావచ్చన్న అనుమానం కలిగింది. కానీ, అనంతరం నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి జరగలేదని స్పష్టమైంది.
పరీక్షలో సైరా శరీరంపై పదునైన ఆయుధంతో దాదాపు 18సార్లు పొడిచినట్లు వెల్లడైంది. దాంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా సైరా మొబైల్ ఫోన్ డేటాను పరిశీలించగా, ఆమెకి హత్యకు ముందు ఐదు మిస్డ్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఆ నంబర్ను ట్రేస్ చేయగా అదే గ్రామానికి చెందిన రఫీ అనే యువకుడిదిగా నిర్ధారణ అయింది.
సైరా తల్లి సఫినా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రఫీ కొంతకాలంగా సైరాను వేధిస్తున్నాడు. పోలీసులు రఫీని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. తనను సైరా ప్రేమను తిరస్కరించిందని, ఆమెలో కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పాడు. అంతేగాక, తనపై గ్రామంలో ఓ వ్యక్తి దాడి చేయడానికీ సైరానే కారణమని అనుమానించినట్లు తెలిపాడు.
ఈ కోపంతో రఫీ ఆమెను పొలాల్లో అడ్డగించి, స్క్రూ డ్రైవర్తో అతి దారుణంగా దాడి చేశాడు. సైరా ప్రాణాల కోసం వేడుకున్నప్పటికీ, అతడు ఆమెపై విరుచుకుపడి స్క్రూ డ్రైవర్ను ఆమె ప్రైవేట్ భాగాల్లో కూడా వాడాడని విచారణలో వెల్లడైంది. ఆమె మరణించిన తర్వాత ఇంటికి వెళ్లి స్నానం చేసి, దుస్తులు మార్చుకుని, నిద్రపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు రఫీపై హత్య ఆరోపణలతో కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: West Bengal: మేనల్లుడిని చంపి.. డెడ్ బాడీని ముక్కలు చేసి సిమెంట్ గోడలో పెట్టిన అత్త
Crime News: ప్రేమను ఒప్పుకోలేదని 18 సార్లు స్క్రూడైవర్ తో పొడిచి యువతిని హత్య