(SHOCKING VIDEO): వృద్ధుడిని కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టిన ఎద్దు
(SHOCKING VIDEO): ఈ రోజుల్లో ఇంటి గడప దాటి బయటకు వెళ్లిన వారు సురక్షితంగా తిరిగి వస్తారో లేదో అన్న అనుమానాలు కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఏ నిమిషాన ఏ ముప్పు ఎదురవుతుందో ఊహించలేని స్థితి.
(SHOCKING VIDEO): ఈ రోజుల్లో ఇంటి గడప దాటి బయటకు వెళ్లిన వారు సురక్షితంగా తిరిగి వస్తారో లేదో అన్న అనుమానాలు కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఏ నిమిషాన ఏ ముప్పు ఎదురవుతుందో ఊహించలేని స్థితి. గతంలో వీధికుక్కల బెదిరింపు చూసాం, కానీ ఇప్పుడు వీధుల్లో తిరిగే పశువుల నుంచే ప్రాణహాని సంభవించే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల ఢిల్లీలోని ఛత్తర్పూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన ఇది నిజంగా హృదయ విదారకమైనదిగా మారింది. ఓ వృద్ధుడు తన ఇంటి గేటు వద్ద నుంచి స్కూటర్ దిశగా వెళ్తుండగా హఠాత్తుగా వచ్చిన ఓ ఎద్దు అతనిపై దాడికి దిగింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎద్దు అతడిని కొమ్ములతో పైకి లేపి, నేలకేసి చితక్కొట్టింది. శరీరంపై పదునైన కొమ్ములతో మళ్లీ మళ్లీ దాడి చేసింది. ఆపకుండా అతడిని రోడ్డుమధ్యకి ఈడ్చుకెళ్లి అక్కడ కూడా హింసించడంతో పరిస్థితి విషమించింది.
అంతే కాకుండా ఇంటి నుంచి వచ్చి వారించబోయిన మహిళలపై కూడా ఎద్దు దాడి చేసేందుకు ముందుకొచ్చింది. ఒక మహిళను కింద పడేసింది. పరిస్థితిని గమనించిన స్థానికులు కర్రలతో వచ్చి ఎద్దును తరిమేందుకు ప్రయత్నించి చివరికి బుజగించి అక్కడి నుంచి పంపించగలిగారు. వృద్ధుడిని స్థానికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు.
గతంలో కూడా ఢిల్లీలో ఇదే తరహాలో ఎద్దు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా, తాజా ఘటన మరోసారి వీధిపశువుల సమస్యను దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చింది. నెటిజన్లు తీవ్ర స్పందన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పౌరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కార దిశగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇకనైనా వీధి పశువుల నియంత్రణకు సాంకేతిక, న్యాయపరమైన మార్గాలు అన్వేషించాలని సామాన్యులు కోరుతున్నారు.
ALSO READ: Harsh Goenka: సామాన్యుడి ప్రాణం ఛాయ్ కప్పు కంటే తక్కువైందా?.. తొక్కిసలాటపై ఆగ్రహం
(SHOCKING VIDEO): వృద్ధుడిని కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టిన ఎద్దు