Phone Mithra : గురుకుల స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఇకనుంచి పేరెంట్స్ తో ఇష్టమున్నట్టు మాట్లాడుకోవచ్చు
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గురుకుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Phone Mithra : ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గురుకుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సేవలను గౌలిదొడ్డిలోని బాలుర, బాలికల సీవోఈ కేంద్రంలో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, సంస్థ కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి సోమవారం ప్రారంభించారు. దీని ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు విద్యార్థులకు ‘ఫోన్ మిత్ర’ అవకాశాన్ని కల్పించింది.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో గురుకులంలో 7 నుంచి 10 టెలిఫోన్ బాక్సులను ఏర్పాటు చేశారు. నలుగురు విద్యార్థులకు కలిపి ఒక ఫోన్ కార్డు అందించారు. ఆ కార్డును ఉపయోగించి, తల్లిదండ్రులు అనుమతించిన ఫోను నంబరుకు విద్యార్థులు ఉచితంగా రోజుకు ఎన్ని సార్లయినా ఫోను చేసి మాట్లాడుకునే అవకాశం కల్పించారు. కార్డులో రిజిస్టరైన నంబర్లకు మాత్రమే ఫోన్ చేసే అవకాశమున్నది. సహాయ కేంద్రం నంబరుకు కూడా ఫోన్ చేసి గురుకులంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే వెసులుబాటు కల్పించారు.
ఈ సందర్భంగా అలుగు వర్షిణి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రతి గురుకుల స్కూల్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 7 నుంచి 10 టెలిఫోన్ బాక్సులను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి నలుగురు విద్యార్థులకు ఒక కార్డ్ ఇస్తామని, దాని సహాయంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో రోజుకు ఎన్ని సార్లయినా ఉచితంగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చని స్పష్టం చేశారు.
Also Read : HIT 3 : ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన నాని లేటెస్ట్ మూవీ ట్రైలర్
Phone Mithra : గురుకుల స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఇకనుంచి పేరెంట్స్ తో ఇష్టమున్నట్టు మాట్లాడుకోవచ్చు