Crime: తను కోసం తెచ్చుకున్న మందు తాగాడని.. కొడుకుని కొట్టి చంపేసిన తండ్రి!
మద్యానికి బానిసైన కొడుకు తాగిన మద్యం విషయమై తండ్రి కన్న కొడుకునే హత్య చేసిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Crime: మద్యానికి బానిసైన కొడుకు తాగిన మద్యం విషయమై తండ్రి కన్న కొడుకునే హత్య చేసిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన సోమవారం ఉదయం అమరావతిలో జరిగింది.
65 ఏళ్ల హిరామన్ దుర్వే తన కోసం మద్యం తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు. కానీ, అతని 35 ఏళ్ల కొడుకు దిలీప్ దుర్వే దానిని తాగేశాడు. మద్యం తాగేందుకు ఏమీ లేకపోవడంతో కోపంతో ఉప్పొంగిపోయిన హిరామన్, దిలీప్తో గొడవపడ్డాడు. వాగ్వాదం అనంతరం హిరామన్ చెక్క కర్రతో దిలీప్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన దిలీప్ అక్కడికక్కడే మృతిచెందాడు.
సంఘటనపై సమాచారం అందుకున్న స్టేషన్ ఇన్చార్జ్ అర్జున్ తోసారే, సబ్ఇన్స్పెక్టర్ దీపక్ దాల్వి నేతృత్వంలోని పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దిలీప్ భార్య రాజకుమారి దుర్వే ఫిర్యాదు ఆధారంగా హిరామన్పై హత్య కేసు నమోదు చేశారు. మృతుడు దిలీప్కు 5 సంవత్సరాల, 2.5 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను నిరుద్యోగిగా ఉండి, మద్యానికి బానిసగా మారాడు. ఈ కారణంగా కుటుంబంలో తరచూ కలహాలు జరిగేవి. చివరికి ఈ వివాదం ఓ ప్రాణం తీసింది.
Also Read: Earthquake: భూకంపంతో కలిసొచ్చింది.. జైలు నుంచి కరడుగట్టిన నేరస్థులతో సహా 216 మంది ఖైదీలు పరార్!
Crime: తను కోసం తెచ్చుకున్న మందు తాగాడని.. కొడుకుని కొట్టి చంపేసిన తండ్రి!