Earthquake: భూకంపంతో కలిసొచ్చింది.. జైలు నుంచి కరడుగట్టిన నేరస్థులతో సహా 216 మంది ఖైదీలు పరార్!
కరాచీలోని హై సెక్యూరిటీ మాలిర్ జైలులో సోమవారం రాత్రి జరిగిన భూకంపం తర్వాత భద్రతా లోపాలను ఉపయోగించుకుని 216 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు.
Earthquake: కరాచీలోని హై సెక్యూరిటీ మాలిర్ జైలులో సోమవారం రాత్రి జరిగిన భూకంపం తర్వాత భద్రతా లోపాలను ఉపయోగించుకుని 216 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు. భూకంపంతో ఏర్పడిన గందరగోళం కారణంగా ఖైదీలు ముమ్మరంగా ప్రవర్తించి జైలు గేటును బలవంతంగా తెరిచి పారిపోయారు. ఈ దృశ్యాలు కరాచీ వీధుల్లో కూడా కనిపించాయి. కొందరు ఖైదీలు “మేము 28 ఏళ్లుగా జైలులో ఉన్నాం” అని బహిరంగంగా అరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘర్షణలో ఒక ఖైదీ మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. అంతేగాక, ఫ్రాంటియర్ కార్ప్స్కు చెందిన ముగ్గురు సిబ్బంది, ఒక జైలు గార్డు కూడా తీవ్రంగా గాయపడ్డారు. జైలు నుండి ఖైదీలు తప్పించుకున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం రాత్రి భూకంప ప్రకంపనలు సంభవించిన తర్వాత భద్రతా సిబ్బంది జాగ్రత్త చర్యగా ఖైదీలను తాత్కాలికంగా బ్యారక్ల నుంచి బయటకు తరలించారు. అయితే దీని కారణంగా 700 నుంచి 1,000 మంది ఖైదీలు ప్రధాన ద్వారం వద్ద గుమిగూడారు. ఈ సమయంలో పరిస్థితిని ఆసరా చేసుకుని 100 మందికిపైగా ఖైదీలు గేటును బలవంతంగా తెరిచి బయటకు పరుగులు తీశారు. ఈ సమయంలో కొందరు సిబ్బందిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు.
సింధ్ హోం మంత్రి జియా ఉల్ హసన్ లంజార్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఖైదీలు జైలు గోడ గుండా కాకుండా ప్రధాన ద్వారం గుండా పారిపోయారని స్పష్టం చేశారు. భూకంప ప్రభావంతో జైలు గోడలపై పగుళ్లు వచ్చినప్పటికీ, అవి పారిపోవడానికి ఉపయోగించలేదని ఆయన వివరించారు. ఈ ఘటన అనంతరం రేంజర్లు, పోలీసులు, ఫ్రాంటియర్ కార్ప్స్ (FC)తో కలిసి విస్తృతమైన శోధన ఆపరేషన్ ప్రారంభించారు. మంగళవారం ఉదయానికి 75 మందికిపైగా ఖైదీలను తిరిగి పట్టుకున్నారు. మిగిలిన పారిపోయిన ఖైదీల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నగరవ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Also Read: Urine: మీ మూత్రం నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు, చికిత్స
Earthquake: భూకంపంతో కలిసొచ్చింది.. జైలు నుంచి కరడుగట్టిన నేరస్థులతో సహా 216 మంది ఖైదీలు పరార్!