CRIME: సుమలత హత్య కేసులోని నిందితుడి అరెస్టు
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామంలో జూన్ 5న చోటుచేసుకున్న కోల సుమలత హత్య కేసులో గ్రామానికి చెందిన గుళ్ల రాజును సోమవారం అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామంలో జూన్ 5న చోటుచేసుకున్న కోల సుమలత హత్య కేసులో గ్రామానికి చెందిన గుళ్ల రాజును సోమవారం అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకుంటూ.. గత మూడేళ్లుగా కోల సుమలతతో కుటుంబ విభేదాలు కొనసాగాయని, ఆమెపై కోపంతోనే ఈ హత్యకు పాల్పడ్డట్టు చెప్పారు. అప్పటివరకు సుమలత ప్రధాన సాక్షిగా ఉన్న కేసుల్లో శిక్ష తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే రాజు ఆమెను గొడ్డలితో దాడి చేసి హతమార్చాడని తెలిపారు.
హత్య అనంతరం మృతురాలి మొబైల్ను తీసుకొని పరారైన నిందితుడు, సోమవారం గ్రామంలోని కమాన్ వద్ద ఉండగా గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. డీసీపీ సలీమా ఆదేశాల మేరకు ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక బృందాలు ముల్కనూర్ శివారులో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. కేసులో ఆధారాలుగా హత్యకు ఉపయోగించిన గొడ్డలి, సెల్ఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసు విచారణలో ప్రధాన పాత్ర పోషించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ముల్కనూర్ ఎస్సై సాయిబాబు, వంగర ఎస్సై దివ్యలను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
ALSO READ: Save money: తక్కువ జీతంతో డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలో తెలుసా?
CRIME: సుమలత హత్య కేసులోని నిందితుడి అరెస్టు