Also Read: New Covid-19: కరోనా మళ్లీ వచ్చేస్తోంది.. పెరుగుతున్న కేసులు.. మళ్లీ టెన్షన్ టెన్షన్
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన కొవిడ్-19 భూతం ఇప్పుడు భారతదేశాన్ని మరోసారి వణికిస్తోంది. మళ్లీ దేశంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆసుపత్రులను అధికారులు హై అలర్ట్లో ఉంచారు.
New Covid-19: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన కొవిడ్-19 భూతం ఇప్పుడు భారతదేశాన్ని మరోసారి వణికిస్తోంది. మళ్లీ దేశంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆసుపత్రులను అధికారులు హై అలర్ట్లో ఉంచారు. ఈ నెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే.
దక్షిణాసియా అంతటా కేసుల పెరుగుదలకు ఓమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన JN.1 వేరియంట్ కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ వేరియంట్ చాలా “యాక్టివ్” అయినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని “ఆందోళన కలిగించే వేరియంట్”గా పేర్కొనలేదు. కొవిడ్ -19 లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారు చాలా వరకు నాలుగు రోజుల్లోనే కోలుకుంటారు. సాధారణ లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట వంటివి ఉండే అవకాశముంది.
ప్రస్తుత స్థితి, భద్రతా చర్యలు
ప్రస్తుతం, భారతదేశంలో దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్-19 కేసులు ఉన్నాయి. పెరుగుదల స్వల్పంగా ఉన్నప్పటికీ, ఇటీవలి నెలల్లో నమోదైన కేసులను బట్టి చూస్తే ఇది స్పష్టమైన పెరుగుదలను సూచిస్తోంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో 85% కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ 95 కేసులతో ముందంజలో ఉంది. తరువాత తమిళనాడు (66), మహారాష్ట్ర (56) ఉన్నాయి. ముఖ్యంగా, ఢిల్లీలో మూడు సంవత్సరాలలో మొదటిసారిగా 23 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. చాలా నెలల నుంచి ప్రశాంతంగా ఉన్నభారతదేశంలోని పలు పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది.
ముఖ్య విషయాలు
- తేలికపాటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపు నాలుగు రోజుల్లో కోలుకుంటారు.
- ఢిల్లీలో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రులు సంసిద్ధంగా ఉండాలని ఆధికారులు ఆదేశించారు.
- మే నెలలో కేరళలో 273 కేసులు నమోదయ్యాయి; నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు.
- కర్ణాటకలో ఒక శిశువుతో సహా 35 కేసులు నమోదయ్యాయి.
- మే నెలలో ముంబైలో 95 కేసులు నమోదయ్యాయి; ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంది.
- థానేలో 10 కేసులు నమోదయ్యాయి; ఆరోగ్య సౌకర్యాలు బాగానే ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ వైద్య సామాగ్రిని సిద్ధం చేసింది; ప్రయాణికులు అనుమానంగా ఉంటే పరీక్షలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read: LIC: 24 గంటల్లో 6 లక్షల బీమా పాలసీలు.. ఎల్ఐసీ గిన్నిస్ రికార్డు
Also Read: New Covid-19: కరోనా మళ్లీ వచ్చేస్తోంది.. పెరుగుతున్న కేసులు.. మళ్లీ టెన్షన్ టెన్షన్