Karnataka: స్క్రాచ్ కార్డు కోసం.. 14 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన 6వ తరగతి బాలుడు
కర్ణాటకలోని హుబ్లిలో 6వ తరగతి విద్యార్థి తన పాఠశాలలో 9వ తరగతి చదువుతోన్న విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Karnataka: కర్ణాటకలోని హుబ్లిలో 6వ తరగతి విద్యార్థి తన పాఠశాలలో 9వ తరగతి చదువుతోన్న విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు జరిగిన చిన్న గొడవ వల్ల ఈ సంఘటన జరిగింది. 14 ఏళ్ల బాధితుడి తల్లి తన కొడుకును ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడైన బాలుడిని జువైనల్ జస్టిస్ హోమ్కు పంపారు. కాగా ఈ ఇద్దరు బాలురు ఒకే పాఠశాలలో చదువుకున్నారు.
ఇంతలో, ఈ సంఘటనపై పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు తమ పిల్లలను సురక్షితంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. “ఒక 6వ తరగతి విద్యార్థి ఎవరినైనా కత్తితో పొడిచే మనస్తత్వాన్ని పెంచుకుంటే అది దురదృష్టకరం. వారు టీవీ లేదా మొబైల్ ఫోన్లలో అదీ కాకపోతే కుటుంబంలో చూసిన పరిస్థితుల ప్రభావం ఫలితంగా వారిలా ప్రవర్తించి ఉండవచ్చు. ఈ సంఘటనతో ప్రతి ఒక్కరూ మేల్కొనాలి. ఈ కేసులో ఒక చిన్న పిల్లవాడిని నిందితుడిగా పేర్కొనాల్సి వస్తోంది” అని హుబ్లి పోలీస్ కమిషనర్ శశి కుమార్ అన్నారు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇద్దరు బాలురు వాగ్వాదానికి పాల్పడ్డారు. వారి గొడవకు కారణం స్క్రాచ్ కార్డులు. ఆ తర్వాత 12 ఏళ్ల నిందితుడు తన ఇంటి నుండి కట్టర్ను తెచ్చి, దాన్ని ఉపయోగించి తన స్నేహితుడి పొత్తి కడుపులో పొడిచాడని పోలీసులు భావిస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
Karnataka: స్క్రాచ్ కార్డు కోసం.. 14 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన 6వ తరగతి బాలుడు