West Bengal: మేనల్లుడిని చంపి.. డెడ్ బాడీని ముక్కలు చేసి సిమెంట్ గోడలో పెట్టిన అత్త
పశ్చిమ బెంగాల్లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మాల్డా జిల్లాకు చెందిన మౌమిత అనే మహిళ తన మేనల్లుడు సద్దాం నదాబ్ను దారుణంగా హత్య చేసింది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మాల్డా జిల్లాకు చెందిన మౌమిత అనే మహిళ తన మేనల్లుడు సద్దాం నదాబ్ను దారుణంగా హత్య చేసింది. మే 18 నుంచి సద్దాం కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మౌమితను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. సద్దాంను హత్య చేసి, అతని శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి, దినాజ్పూర్ జిల్లాలోని తపన్ ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటిలో సిమెంట్ గోడలో దాచినట్లు మౌమిత చెప్పింది.
పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేయగా, ప్లాస్టిక్తో చుట్టి, కాంక్రీటులో మూసి ఉంచిన సద్దాం మృతదేహాన్ని గుర్తించారు. బాధితుడు సద్దాం లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీల్లో పాల్గొనేవాడు. మౌమిత తన అల్లుడు సద్దాంతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఒకే ప్రదేశంలో పని చేయడం వల్ల ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడినట్లు భావిస్తున్నారు. అయితే సద్దాం, ఆమెను కొన్ని ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అందుకే తనను చంపినట్లు మౌమిత పోలీసులకు చెప్పింది.
కానీ పోలీసులు దీనికి డబ్బుల వ్యవహారమే అసలు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సద్దాం దగ్గర ఉన్న లక్షల రూపాయల కాబట్టి ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీసినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తుండగా, మౌమిత భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: Kamal Hassan: సారీ చెప్పను.. కర్ణాటకలో రిలీజ్ చేయను.. ‘థగ్ లైఫ్’పై విశ్వ నటుడు కీలక వ్యాఖ్యలు
West Bengal: మేనల్లుడిని చంపి.. డెడ్ బాడీని ముక్కలు చేసి సిమెంట్ గోడలో పెట్టిన అత్త