Allu Ayaan: ఆర్సీబీ విజయం.. అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఎమోషనల్.. వీడియో వైరల్
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు చివరికి తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్-2025 ట్రోఫీని తొలిసారి గెలుచుకుంది.
Allu Ayaan: 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు చివరికి తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్-2025 ట్రోఫీని తొలిసారి గెలుచుకుంది. జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్తో ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయంతో తన కల నెరవేరిందని, ఇది తనతో పాటు అభిమానులందరికీ ప్రత్యేకమైన ఘట్టమని అన్నారు.
ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడాన్ని దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. టపాసులు కాల్చుతూ, డీజే పాటలు వింటూ ఊరేగింపులతో సందడిగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సాధారణ అభిమానులకే పరిమితం కాకుండా, సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram
ఈ సందర్భంగా సినీ నటుడు అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫ్యాన్ బాయ్ మూమెంట్ను షేర్ చేశారు. అందులో అతని కుమారుడు అల్లు అయాన్ ఆర్సీబీ విజయం చూసి ఎంతో ఉత్సాహంతో, భావోద్వేగంతో స్పందించాడు. తాను విరాట్ కోహ్లీకి వీరాభిమానినని చెప్పిన అయాన్, తలపై బాటిల్తో నీళ్లు కుమ్మరించుకుంటూ తన ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: Instagram: రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు అమ్మాయిలు.. అసలేమైందంటే..
Allu Ayaan: ఆర్సీబీ విజయం.. అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఎమోషనల్.. వీడియో వైరల్