Rare Surgery: ఆడుకుంటుండగా మెడ నుంచి మెదడులోకి దూసుకెళ్లిన మేకు.. ఆ తర్వాతేమైందంటే..
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యులు ఒక అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని బలరాంపుర్ జిల్లా నవాజ్పుర్ గ్రామానికి చెందిన 7 ఏళ్ల బాలుడిని ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడేశారు.
Rare Surgery: లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యులు ఒక అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని బలరాంపుర్ జిల్లా నవాజ్పుర్ గ్రామానికి చెందిన 7 ఏళ్ల బాలుడిని ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడేశారు. మే 15న ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ బాలుడు కింద పడిపోవడంతో, ఒక 8 సెంటీమీటర్ల పొడవున్న ఇనుప మేకు అతడి మెడలోకి బలంగా దూసుకెళ్లింది. ఆ మేకు మెదడులోకి చేరి అక్కడే దిగబడిపోయింది.
కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం బలరాంపుర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అతడిని తక్షణమే లక్నోలోని KGMU ట్రామా సెంటర్కు తరలించారు. మే 16 తెల్లవారుజామున 1 గంటకు డాక్టర్ సమర్, డాక్టర్ అశుతోష్ బాలుడిని పరిశీలించి, మేకు మెదడులోకి ప్రవేశించినప్పటికీ కీలకమైన రక్తనాళాలకు హానీ కలగలేదని గుర్తించారు. అయినప్పటికీ, కేసు అత్యంత సంక్లిష్టమైనదిగా భావించి, న్యూరో సర్జరీ, ENT నిపుణులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి తక్షణమే శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు.
అదే రోజు రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఆ శస్త్రచికిత్స దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. ఈ సర్జరీలో డాక్టర్ వైభవ్ జైస్వాల్, డాక్టర్ సమీర్ మిశ్రా, డాక్టర్ యాదువేంద్ర, డాక్టర్ లోకేశ్, డాక్టర్ ఏక్తా తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉండి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడం వైద్య రంగంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలుస్తుందని, ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతుందని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Video: కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయట పడేసిన అవినీతి అనకొండ
Rare Surgery: ఆడుకుంటుండగా మెడ నుంచి మెదడులోకి దూసుకెళ్లిన మేకు.. ఆ తర్వాతేమైందంటే..